‘నా కెరీర్ ఎడిటర్గా మొదలైంది. పాకెట్మనీకోసం టీవీ సీరియల్స్, యాడ్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేసేవాడ్ని. కొన్ని యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను కూడా. పదేళ్లు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా. ఆ తర్వాత హైదరాబాద్ రావడం, ‘మళ్లీ మొదలైంది’తో దర్శకుడ్ని కావడం అనుకోకుండా జరిగిపోయింది’ అని తెలిపారు దర్శకుడు కీర్తి కుమార్. కామెడీ ప్రధానంగా ఆయన తీసిన తాజా సినిమా ‘చారి 111’. వెన్నెల కిశోర్ టైటిల్రోల్ చేశారు. సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. అదితి సోని నిర్మాత. మార్చి 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు కీర్తికుమార్. ‘ ‘మళ్లీ మొదలైంది’ షూటింగ్ టైమ్లోనే ఈ ఐడియా వెన్నెల కిశోర్కి చెప్పాను. ఆయన స్క్రిప్ట్ సెండ్ చెయ్యమన్నారు. చదివి ఓకే చెప్పారు.
పింక్ పాంథర్, జానీ ఇంగ్లీష్ వంటి హాలీవుడ్ సినిమాలు ఈ కథకు ప్రేరణ. ‘జానీ ఇంగ్లీష్’ సినిమా చూసినప్పుడు దర్శకుడ్ని అయితే, ఇటువంటి కథతో వెన్నెల కిశోర్తో సినిమా చేయాలని అప్పుడే అనుకున్నాను. ఆ కోరిక ఇలా నెరవేరింది. వెన్నెల కిశోర్, మురళీశర్మలను దృష్టిలోపెట్టుకొని ఈ స్క్రిప్ట్ రాశాను’ అని చెప్పారు కీర్తికుమార్. చిరంజీవి చంటబ్బాయ్, రుద్రనేత్ర చిత్రాల వాసన ఈ సినిమాలో ఉంటుందని, తెరపై ఆర్టిస్టులు సీరియస్గా ఉంటారని, కానీ కామెడీ మాత్రం అద్భుతంగా పండుతూ వుంటుందని ఆయన తెలిపారు. ‘ఇందులో ‘విలన్ ఎవరనేది సస్పెన్స్. అది తెరపైనే చూడాలి. అందుకే అతడ్ని మాస్క్లో చూపిస్తున్నాం. భవిష్యత్తులో స్టార్హీరోలతో కూడా సినిమాలు చేస్తాం’ అని కీర్తికుమార్ చెప్పారు.