ముంబై : మోడల్, నటి పూనం పాండే మళ్లీ చిక్కుల్లో పడ్డారు. పూనంతో పాటు ఆమె మాజీ భర్త శాం బాంబేపై కనకొనా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. గోవాలో 2020లో న్యూడ్ ఫోటోషూట్లో పాల్గొన్నందుకు పోలీసులు కనకొనా ఫస్ట్క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రీట్ ఎదుట చార్జిషీట్ నమోదు చేశారు. 2020లో కనకొనాలో ఆమె న్యూడ్ పోటోషూట్లో పాల్గొన్నారని, అటుపై పూనం పాండేపై పలువురు ఫిర్యాదు చేశారని చార్జిషీట్ ఆరోపించింది.
పూనం పాండే ఫోటోషూట్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొంది. బహిరంగంగా అభ్యంతరకర చర్యలకు పాల్పడ్డారని పూనం, శాం బాంబేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశ్లీల వీడియోగ్రఫీ, అందరిముందే అభ్యంతరకర నృత్యాలతో పాటు పాటలు పాడారని పోలీసులు వారిపై అభియోగాలు మోపారు.
ఇక 2021లో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో పూనం శాంబాంబేకు దూరంగా ఉంటున్నారు. తనను శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శాంబాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పూనం, శాంబాబేలు సెప్టెంబర్ 2020లో ముంబైలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెండ్లికి ముందు వారిద్దరూ మూడేండ్ల పాటు డేటింగ్ చేశారు.