మెగా బ్రదర్ ముద్దుల కూతురు నిహారిక ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉంది. డిసెంబర్ 9న తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కాగా, భర్తతో కలిసి స్పెయిన్కి వెళ్లింది. అక్కడ అందమైన ప్రదేశాలను చూస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా నిహారిక- చైతన్య డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కు వెళ్లారు. అక్కడ తినకుండా నిహా తన ఫోన్లో బిజీగా ఉంది.
ఈ క్రమంలో చైతన్య ఆ సన్నివేశాన్ని కెమెరాలో బంధించి .. ‘ఎప్పుడు ఇదే పని, ప్రతి క్షణం ఫోన్లో ఇలా బిజీ ఉంటుంది’ అంటూ కామెంట్ చేశాడు. నిహారిక అలాగే ఫోన్ చూస్తున్న మరో ఫొటోను కాసేపటికి షేర్ చేస్తూ ‘కొన్నిమిలియన్ క్షణాల తర్వాత’ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. నిహారిక- చైతన్య అల్లరి మాములుగా లేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తున్న ఆలీతో సరదాగా షోకి గెస్టుగా వచ్చిన నిహారిక చాలా విషయాలపై ఓపెన్ అయింది. తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య విషయాలను ఆలీతో సరదాగా పంచుకుంది. తాను జర్నలిజంలో డిగ్రీ పొందానని, తనకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
తన సినీ కెరీర్ గురించి స్పందించిన నిహారిక.. ఉదాహరణగా సమంత ఇష్యూ తీస్తూ.. పెళ్లికి ముందు సమంతకు ఎంత క్రేజ్ ఉందో పెళ్లి తరువాత కూడా అంతే క్రేజ్ ఉంది. ఇంకా ఎక్కువ అయింది కూడా. అలా పెళ్ళయితే క్రేజ్ తగ్గుతుందని చెప్పలేం అని చెప్పిన నిహారిక.. మా ఆయనకు నేను సినిమాలు చేయడమంటే ఇష్టం లేదు, అందుకే చేయడం లేదని స్పష్టం చేసింది. .