ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మాతలు. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘యు.ఏ’ సర్టిఫికెట్ లభించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
‘అన్ని వర్గాలను ఆకట్టుకునే పీరియాడిక్ డ్రామా కథాంశమిది. 1930-40 దశకంలో కథ నడుస్తుంది. ధనుష్ పాత్ర మునుపెన్నడూ చూడనంత పవర్ఫుల్గా ఉంటుంది. యాక్షన్ ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తుంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్.