Bro | క్రేజీ కథానాయకుడు పవన్కళ్యాణ్, హీరో సాయిధరమ్ తేజ్ కలయికలో రాబోతున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకుడు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల శనివారం జరిగింది. వైజాగ్ జగదాంబ థియేటర్లో జరిగిన ఈ వేడుకలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘మీ ప్రేమ పొందటం కోసమే ఇంత దూరం వచ్చాను. మీ అందరికి ట్రైలర్ నచ్చడం ఎంతో సంతోషంగా వుంది’ అన్నారు.
ఈ సినిమా కోసం అందరిలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కుటుంబంతో కలిసి థియేటర్కి వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిదని కథానాయిక కేతిక శర్మ అన్నారు. ట్రైలర్ హైలైట్స్: ట్రైలర్లో పవన్కల్యాణ్ సెక్యూరిటీ ఆఫీసర్గా, కూలీగా విభిన్న గెటప్స్లో కనిపించాడు. సాయిధరమ్ తేజ్కి గతంలోకి వెళ్లే అరుదైన అవకాశం ఉందని పవన్కల్యాణ్ చెప్పడం, జీవితం, మరణం గురించి చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. ఎమోషన్, కామెడీ, యాక్షన్ అంశాల కలయికగా చిత్రం ఉంటుందని ట్రైలర్ను చూస్తే అనిపిస్తుంది.