మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకుడు. రామచంద్రం, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్ థ్రిల్లర్ కథాంశమిది.
ఓ కాల్పనిక ప్రపంచంలో కథ జరుగుతుంది. భ్రమయుగం వెనకున్న రహస్యమేమిటనేది ఆసక్తికరమైన అంశం. భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం’ అన్నారు.