Brahmanandam | ప్రముఖ తెలుగు నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం-లక్ష్మి దంపతులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. పెద్ద కొడుకు గౌతమ్తో కలిసి ప్రగతి భవన్లో చిన్న కొడుకు సిద్ధార్థ్ పెళ్లికి రావాలని సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానపత్రికను అందజేశారు. హైదరాబాద్లో జరిగే పెళ్లి వేడుకకు తప్పకుండా హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం-లక్ష్మి దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
బ్రహ్మానందం పెద్దకుమారుడు రాజా గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పలు చిత్రాల్లో హీరోగా నటించిన గౌతమ్.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. రెండో తనయుడు సిద్ధార్థ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. మొదటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ.. విదేశాల్లో విద్యనభ్యసించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఇక సిద్ధార్థ్ ఈ ఏడాది మేలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
అప్పుడే బ్రహ్మానందంకు రెండో తనయుడి గురించి అందరికీ తెలిసింది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబుతున్నారు. ఆమె సైతం డాక్టర్గా సేవలందిస్తున్నది. మే 21న హైదరాబాద్లో అట్టహాసంగా జరిగిన సిద్ధార్థ్ – ఐశ్వర్య నిశ్చితార్థ వేడుక జరిగింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు.