Bramayugam | మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మించారు. ఇటీవలే మలయాళంలో విడుదలైంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ నెల 23న ఇక్కడ విడుదలకానుంది. ‘ఈ సినిమాలో మమ్ముట్టి మాంత్రికుడి పాత్రలో కనిపిస్తారు. బ్లాక్ అండ్ వైట్లో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. మమ్ముట్టి నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షెహనాద్ జలాల్, సంగీతం: క్రిస్టో జేవియర్, రచన-దర్శకత్వం: రాహుల్ సదాశివన్.