Prashanth Varma – Ranveer Singh | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman). గతేడాది ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం దీనికి సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అయితే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్ను ఖరారు చేశారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, అన్ని భాషల్లో అదే టైటిల్ ఉంటుందని అంటున్నారు. ‘హనుమాన్’ సినిమా తరహాలోనే సూపర్హీరో కథాంశంతో ‘బ్రహ్మరాక్షస’ తెరకెక్కనుందని, భారీ సాంకేతిక హంగులతో ఈ సినిమాను తీయబోతున్నారని హనుమాన్ జయంతికి పూజా కార్యక్రమాలతో లాంఛ్ కూడా అయిందని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలీదు సడెన్గా ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు రావడం మళ్లీ మొదలయ్యాయి. హీరో దర్శకుడు మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని అంతా అన్నారు. కానీ ఈ వార్తలు ఫేక్ అని తాజాగా ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.
మరోవైపు ‘జై హనుమాన్’ కంటే ముందే ‘బ్రహ్మరాక్షస్’ సినిమా రానున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపాడు. ఇది కూడా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే వస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.