హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విఛాన్ చేయగా..నిర్మాత స్రవంతి రవికిషోర్ క్లాప్ నిచ్చారు. దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ..‘మా సంస్థలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాం. నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అన్నారు.