Border 2 | బాలీవుడ్లో క్లాసిక్ వార్ డ్రామాగా నిలిచిన ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ‘బోర్డర్ 2’ (Border 2) బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తోంది. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో, అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ వార్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దేశభక్తి భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాల భీకరత, సాంకేతిక నైపుణ్యం ఈ చిత్రాన్ని భారీ హిట్ దిశగా నడిపిస్తున్నాయి.విడుదలైన 10వ రోజుకే ఈ సినిమా కీలక మైలురాయిని అందుకుంది. ముఖ్యంగా రెండో ఆదివారం రోజున బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
రెండో ఆదివారం ఒక్కరోజే సుమారు రూ.24.22 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించడంతో ఈ చిత్రం భారత్లో ప్రతిష్టాత్మకమైన రూ.300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది. తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ.301.89 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. అయితే అసలైన పరీక్ష ఇప్పుడే ప్రారంభమవుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. వారాంతపు హైప్ తర్వాత సోమవారం నుంచి కలెక్షన్లు తగ్గే అవకాశం ఉండటంతో, దీర్ఘకాలంలో సినిమా ఎంత స్థాయిలో రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ మొదటి రెండు వారాల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించడం ‘బోర్డర్ 2’కు ఉన్న క్రేజ్ను స్పష్టంగా చూపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ చిత్ర విజయోత్సాహంలోనే మేకర్స్ మరో కీలక ప్రకటన చేశారు. ‘బోర్డర్ 3’ ను కూడా అధికారికంగా ప్రకటిస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. టీ-సిరీస్ ఫిల్మ్స్ మరియు జెపి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్లో వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ‘బోర్డర్’ ఫ్రాంచైజీపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.మొత్తంగా చూస్తే, దేశభక్తి కథాంశంతో వచ్చిన ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ, వరుస రికార్డులు సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎలాంటి మైలురాళ్లు చేరుకుంటుందో అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.