ప్రతీ యేటా దసరాకు బాక్సాఫీస్ వద్ద సినిమాల (Dussehra Telugu movies 2022) మధ్య పోరు ఉండటం సాధారణ కనిపించేదే. ఎప్పటిలాగే ఈ సారి కూడా దసరా బరిలో మూడు తెలుగు చిత్రాలు నిలుస్తున్నాయి. వీటిలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ పెద్ద చిత్రాలు కాగా..చిన్న సినిమా స్వాతిముత్యం ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న గాడ్ ఫాదర్ (God Father) అక్టోబర్ 5న దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
అక్కినేని నాగార్జున నటించిన ది ఘోస్ట్ (The Ghost)తోపాటు బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్వాతిముత్యం (Swathimuthyam) ఇదే రోజు సందడి చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో దసరా చిత్రాలకు టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. నైజాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు సినిమాకు బుకింగ్స్ షురూ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
ఇప్పటికే ఆయా చిత్రాల మేకర్స్ అండ్ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. మరి ఏ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకోబోతుందనేది చూడాలి. గాడ్ ఫాదర్ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. ది ఘోస్ట్ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. లక్ష్మణ్ కే కృష్ణ స్వాతిముత్యం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Read Also : PS-1 US collections | యూఎస్ బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్-1 హవా..కలెక్షన్లివే
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎస్ఎస్ రాజమౌళి..వీడియో
Read Also : HHVM Workshop Stills | ‘హరిహరవీరమల్లు’ వర్క్ షాప్ స్టిల్స్ వైరల్