ఒక్కోసారి ఎటువంటి ఇబ్బందులూ లేకపోయినా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. శ్రీదేవి తనయ జాన్వీకపూర్కి ఇప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తింది. ముంబయిలోని ఖరీదైన ప్రాంతమైన ఆంధేరీలో జాన్వీకీ, ఆమె చెల్లెలు ఖుషీకీ, ఆమె తండ్రి బోనీ కపూర్కి ఉమ్మడి ఆస్తిగా నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటిని శ్రీదేవి ఫ్యామిలీ 12కోట్ల రూపాయాలకు అమ్మేసింది. వీటిలో 1870 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు ఫ్లాట్స్ని సిద్దార్థ్ నారాయణ్, అంజు నారాయణ్ అనే వ్యక్తులు దక్కించుకోగా, 1614 చదరపు అడుగుల విస్తీర్ణం గల మరో రెండు ఫ్లాట్స్ని ముస్కాన్ బహిర్యాణి, లలిత్ బహిర్యాణీ దక్కించుకున్నారు.
నిరర్థకంగా పడివున్న ఆస్తులను వదిలించుకునే క్రమంలో ఈ ఖరీదైన ఆస్తుల్ని కూడా అమ్మేసుకున్నారు శ్రీదేవి కుటుంబసభ్యులు. త్వరలో ముంబయ్లోనే ఖరీదైన భవంతి కొనే ఆలోచనలో జాన్వీ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో హవా సాగిస్తున్నది. అంతేకాక, తెలుగులో కూడా అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా రూపొందుతున్న ‘దేవర’లో జాన్వీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.