ముంబై: నీలి చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాకు ముంబై హైకోర్టులో చుక్కెదురైంది. కుంద్రా దాఖలు చేసిన పిటిషన్పై విచారించేందుకు ఇవాళ బాంబే హైకోర్టు నిరాకరించింది. సరైన కారణం లేకుండా తమను కస్టడీలోకి తీసుకున్నారని కుంద్రా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ముంబైలోని ఆర్తర్ రోడ్డు జైలులో రాజ్కుంద్రాతో పాటు ర్యాన్ థోర్స్ను ఉంచారు. వాళ్లు ఇద్దరు పెట్టుకున్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఏఎస్ గడ్కరీతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. కోర్టు విచారణలో కుంద్రా నేరుగా పాల్గొన్నారు.
జూలై 19వ తేదీన ముంబై క్రైం బ్రాంచీ పోలీసులు రాజ్కుంద్రాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబైలో షూట్ చేసిన పోర్న్ మూవీలను.. విదేశాల్లో హాట్షాట్ యాప్ ద్వారా రిలీజ్ చేస్తున్నట్లు కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. కుంద్రా ఆఫీసులో ఉన్న ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఉందని, దాంట్లో సుమారు వంద పోర్న్ వీడియోలు ఉన్నట్లు లాయర్ కోర్టుకు తెలిపారు. శృంగార అంశానికి సంబంధించిన సినీ స్క్రిప్ట్లు కూడా అతని వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.