బాలీవుడ్ అగ్రహీరో హీరో సైఫ్అలీఖాన్ తెలుగులో విలన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే..ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నారని సమాచారం. సైఫ్అలీఖాన్ వంటి పెద్ద హీరో నటిస్తే సినిమాకు పాన్ ఇండియా రీచ్ మరింతగా పెరుగుతుందన్నది చిత్రబృందం ఆలోచనగా చెబుతున్నారు.
ఈ సినిమా ద్వారా జాన్వీకపూర్ తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది. ఈ చిత్రం ఈ నెల 24న లాంఛనంగా ప్రారంభం కానుంది.