Bollywood Stars |భారతీయులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. ప్రస్తుతం ఈ పండగకి మూడు రోజులే సమయం ఉండటంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడం ప్రారంభించేశారు. వెలుగుల పండగను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ తారలైతే పదిరోజుల ముందు నుంచే దీపావళి సంబరాలు ప్రారంభించేశారు. రోజూ పార్టీలంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా తన ఇంట్లో.. స్నేహితులు, కుటుంబ సభ్యులకు దివాళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి పలువురు బీటౌన్ తారలు హాజరై సందడి చేశారు. ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్, కత్రినా-విక్కీ కౌశల్, కాజోల్, కియారా అడ్వాణీ, రకుల్ ప్రీత్ సింగ్, కరిష్మా కపూర్, సారా అలీఖాన్, అనన్య పాండే, సుహానాఖాన్, శిల్పాశెట్టి, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ తదితర బీటౌన్ తారలు పార్టీకి హాజరై.. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.