చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దాదాపు పదేండ్ల తర్వాత అసలైన స్టార్డమ్ను అస్వాదిస్తున్నది బాలీవుడ్ తార మృణాల్ ఠాకూర్. ఇన్నేండ్ల శ్రమంతా పెట్టుబడి అన్నట్లు ఆమెకు తీరిక లేనన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రేజ్ అంతా ‘సీతారామం’ ఘన విజయం ప్రభావమే అనుకోవచ్చు. హిందీలో ఐదు చిత్రాల్లో నటిస్తున్న మృణాల్.. నాని హీరోగా నటిస్తున్న 30వ చిత్రంలోనూ కనిపించనుంది. తాజాగా ఈ భామ కోలీవుడ్లో అరంగేట్రానికి సిద్ధమవుతున్నది. సూర్య హీరోగా నటిస్తున్న 42వ చిత్రంలో నాయికగా మృణాల్ ఎంపికైంది. యుద్ధం నేపథ్యంగా సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శివ. ఈ చిత్రంలో ఒక నాయికగా దిశా పటానీ నటిస్తుండగా…మరో హీరోయిన్గా మృణాల్ను ఎంచుకున్నారు. ఈ చిత్రంలో ప్లాష్ బ్యాక్లో వచ్చే పీరియాడిక్ ఎపిసోడ్స్లో మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తున్నది. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వీర్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. పది భారతీయ భాషల్లో త్రీడీ ఫార్మేట్లో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న క్యారెక్టర్స్లో కనిపిస్తారని సమాచారం.