భారతీయ ధర్మంలో మధురప్రేమకు నిదర్శనంగా నిలిచిన రాధాకృష్ణుల ప్రణయగాథ వెండితెర దృశ్యమానం కానుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సచిన్ రవి దర్శకత్వం వహిస్తారు. భారతీయ పురాణాల్లో అజరామర ప్రేమగాథగా కీర్తించబడిన రాధామాధవుల ప్రణయాన్ని భారీ స్థాయి విజువల్స్తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధిచిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని తెలిసింది.
రాధాకృష్ణుల బంధంలోని ప్రేమ, విరహం, విషాదం వంటి అంశాలతో ఈ ఆధ్యాత్మిక కథను తీర్చిదిద్దబోతున్నారని, కృష్ణుడి జననం నుంచి రాధాకృష్ణుల ప్రణయం వరకు వివిధ ఘట్టాలను ఆవిష్కరిస్తూ ఈ కథ సాగుతుందని సమాచారం. కన్నడ చిత్రం ‘అవనే శ్రీమన్నారాయణ’ చిత్రంతో దర్శకుడు సచిన్వ్రి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. పలు చిత్రాలకు ఎడిటర్గా కూడా పనిచేశారాయన. ‘రాధాకృష్ణ’ సినిమా ద్వారా ఆయన బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉంటుందని తెలిసింది.