కోలీవుడ్లో విభిన్నకథాచిత్రాల దర్శకుడిగా వెట్రిమారన్కి పేరుంది. ఆయన డైరెక్షన్లో నటించేందుకు నటీనటులు ఎక్కువగా ఆసక్తి చూపించడానికి కారణం అదే. ఆ అవకాశం ఇప్పుడు హీరో శింబుని వరించింది. ప్రస్తుతం ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అరసన్’ అనే సినిమా చేస్తున్నారు. కలైపులి థాను నిర్మాత. వెట్రిమారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శింబు విభిన్నమైన ఆరు గెటప్పుల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మూడు గెటప్పులకు చెందిన షూటింగ్ పూర్తి చేసినట్టు తెలిసింది. ఉత్తర చెన్నైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది.
అధికార పోరాటాలు, భీకరమైన ముఠా కక్ష్యల నేపథ్యంలో.. వెట్రిమారన్ బ్లాక్బస్టర్ ‘వడా చెన్నై’ ప్రపంచాన్ని పునరావిష్కరించేలా ఈ కథ ఉంటుందని వినికిడి. ఈ సినిమా గురించి హీరో శింబు మాట్లాడుతూ ‘ప్రేక్షకులపై ‘దురంధర్’ ఫ్రాంచైజీ ఎంతటి ప్రభావం చూపించిందో.. లార్జర్ దేన్ లైఫ్గా సాగే ఈ సినిమా కూడా అంతటి ప్రభావం చూపుతుంది. ఈ కథ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది’ అని తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి విడుదలయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రీకరణ ఇంకా మిగిలివున్నందున ఆ టైమ్కి రిలీజ్ కావడం కష్టమే అని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.