ముంబై : నవరాత్రి వేడుకల్లో భాగంగా బుధవారం దుర్గాష్టమి సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ముంబైలోని జుహులో ఏర్పాటు చేసిన దుర్గా మంటపానికి హాజరై పూజలు చేశారు. దసరా వేడుకలకు బీటౌన్ తరలివచ్చిందా అనేలా దుర్గా మంటపాల్లో తారలు తళుక్కుమన్నారు.
జయా బచ్చన్, రాణి ముఖర్జీ, కాజోల్, రణ్బీర్ కపూర్, మౌనీ రాయ్, బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ సహా పలువురు ప్రముఖులు మంటపాలను సందర్శించి దుర్గా మాత ఆశీస్సులు పొందారు. బాలీవుడ్ సెలబ్రిటీలు తోటి నటీనటులతో మంటపాల్లో సందడి చేస్తూ అక్కడున్న వారిని పలుకరిస్తూ కలియతిరిగారు.