న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ఇషా గుప్తాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఇషా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో నేను హోమ్ ఐసోలేషన్లో ఉన్నా. కొవిడ్ ప్రొటోకాల్స్ అన్నీ పాటిస్తున్నా’ అని పేర్కొన్నారు. అదేవిధంగా అందరూ కొవిడ్ నిబందనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు.
తాను త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటానని ఇషా గుప్తా పేర్కొన్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవడంతోపాటు మాస్కులు ధరించి ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని తన అభిమానులను కోరారు. చివరగా ఐ లవ్ యూ ఆల్ అని రాసుకొచ్చారు.