Kiara Advani | ఎట్టకేలకు బాలీవుడ్ లవ్బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ఢిల్లీలోని తన నివాసానికి కియారాతో కలిసి సిద్ధార్థ్ మల్హోత్రా వెళ్లారు. అక్కడే లీలా ప్యాలెస్లో గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించారు. సినీ తారల కోసం ఆదివారం ముంబైలో మరోసారి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నవదంపతుల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్గా మారింది.
పెళ్లి తర్వాత కియారా అద్వానీతో కలిసి ఉండేందుకు సిద్ధార్థ్ మల్హోత్రా ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడట. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో బీచ్ వ్యూతో ఉన్న ఓ భవనంలో అపార్ట్మెంట్ కొని కియారాకు కానుకగా ఇస్తున్నాడని సమాచారం. ఈ ఇంటి విలువ దాదాపు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని బీటౌన్లో టాక్ నడుస్తోంది. తొందరలోనే కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా ఈ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది.