ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం (Indian citizenship) దక్కింది. భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయనకు ఇండియన్ సిటిజన్షిప్ లభించింది. దాంతో అక్షయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్లో (ట్విటర్లో) రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫొటోను షేర్ చేశాడు.
‘ఆ ట్వీట్కు ‘దిల్ ఔర్ సిటిజన్షిప్, దోనో హిందుస్థానీ. హ్యాప్పీ ఇండిపెండెన్స్ డే..! జై హింద్..! (హృదయం, పౌరసత్వం రెండూ హిందుస్థాన్వే. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..! జైహింద్..!)’ అనే మెసేజ్ను జతచేశాడు. కాగా, అక్షయ్ కుమార్కు గతంలో కెనడా పౌరసత్వం తీసుకున్నారు. దాంతో భారత దేశం మీద ఆయనకు ఉన్న ప్రేమపై ప్రశ్నలు వెల్లువెత్తాయి.
దాంతో ఇబ్బంది పడిన అక్షయ్కుమార్ 2019లో మళ్లీ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు భారత పౌరసత్వం దక్కింది. కాగా, వరుసగా 14 సినిమాలు ఫ్లాప్ కావడంతో కెనడాలో ఉండే నా స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి ఏదో ఒకటి చేసి బతుకుదామనుకున్నానని, అందుకే కెనడా పౌరసత్వం తీసుకున్నానని అక్షయ్ కుమార్ గతంలో తెలిపాడు. 15వ సినిమా హిట్ కావడంతో నిర్ణయం మార్చుకుని ఇక్కడే ఉండిపోయానని చెప్పాడు.
Actor Akshay Kumar is an Indian citizen now. pic.twitter.com/W4RLLaDppx
— ANI (@ANI) August 15, 2023