Ram Gopal Varma | దర్శక నిర్మాత రామ్ గోపాల్వర్మ చిక్కుల్లోపడ్డారు. బీజేపీ కార్యకర్తగా చెప్పుకుంటున్న సుభాష్ రాజోరా అనే వ్యక్తి రామ్గోపాల్ వర్మపై ముంబై కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సుభాష్ ఈ నెల 14న ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది డీవీ సరోజ్ శనివారం తెలిపారు. రామ్ గోపాల్ వర్మపై సెక్షన్ 499, 500 (పరువు నష్టం), 504 (ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 కింద చర్యలు తీసుకోవాలని బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు.
అయితే, పిటిషన్పై విచారణను అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు న్యాయవాది సరోజ్ తెలిపారు. రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ద్రౌపది ముర్ముపై అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని, మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమేనని ఫిర్యాదులో ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో గత నెలలో ద్రౌపది ముర్మును ఎన్డీయే ద్రౌపది ముర్మును తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ జూన్ 22న ద్రౌపదీ ప్రెసిడెంట్ అయితే.. పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదంటూ వర్మ పేర్కొన్నారు.