స్వాతంత్య్ర సమరయోధుడు వినోబా భావే ఆరంభించిన భూదానోద్యమంలో వందల ఎకరాలు దానం చేసి నాడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి. ఆయన జీవిత చరిత్ర వెండితెర దృశ్యమానం కాబోతున్నది. ఈ చిత్రానికి నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. ‘మహాయజ్ఞంలా సాగిన పోచంపల్లి భూదానోద్యమం గురించి నేటి తరానికి తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలో నటీనటులను ఎంపిక చేసి సినిమాను ప్రారంభిస్తాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: అరవింద్రెడ్డి, నిర్మాత: కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.