వికాస్ వశిష్ట (‘సినిమాబండి’ ఫేమ్), బిందుమాధవి జంటగా సరస్వతి క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీచైతు దర్శకురాలు. ముహూర్తపు సన్నివేశానికి గాయని సునీత క్లాప్నివ్వగా, చిత్ర నిర్మాత అన్నదాత భాస్కరరావు దర్శకుడికి స్క్రిప్ట్ను అందజేశారు. ‘ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలుంటాయి’ అని చిత్రబృందం తెలిపింది. పూజా రామచంద్రన్, సమీర్, మధుమణి, సనా, జబర్దస్త్ రాజమౌళి, బాహుబలి కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాగర్ వైవీవీ, జితిన్మోహన్, సంగీతం: సునీల్కశ్యప్, నిర్మాత: డా॥ భాస్కర్రావు అన్నదాత, కథ, అడిషినల్ స్క్రీన్ప్లే, దర్శకత్వం: శ్రీచైతు.