ముంబై : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్కు బిహార్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ వెబ్ సిరిస్లో అభ్యంతరకర సన్నివేశంపై ఆమెతో పాటు తల్లి శోభపై సైతం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఏక్తా కపూర్ సినిమాలతో పాటు సీరియల్స్, వెబ్ సిరిస్లను సైతం నిర్మిస్తుంటారు. తన వెబ్ సిరిస్లను ప్రసారం చేసేందుకు ఏకా.. ‘ఆర్ట్ బాలాజీ’ పేరుతో ఓటీటీ ప్లాట్ఫామ్ను సైతం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆమె తాజాగా ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ పేరుతో వెబ్సిరిస్ను నిర్మించగా.. మంచి వ్యూస్ను సాధించాయి. తాజా సిరిస్లో సైనిక కుటుంబాలను అభ్యంతరకరంగా చూపించారనే విమర్శలు వెల్లువెత్తగా.. ఈ క్రమంలోనే బిహార్లోని బెగుసరైలో సిరిస్ నిర్మాతలైన ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్లపై కేసు నమోదైంది. శంభు కుమార్ అనే మాజీ సైనికుడు వీరిపై కేసు వేశారు.
కేసు విచారించిన కోర్టు ఏక్తా, శోభలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కోర్టు అరెస్ట్ వారెంట్తో చిక్కుల్లోపడగా.. ఆమె చేసిన పనితో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియోలో ఏక్తా కపూర్ గుడిబయట కూర్చున్న వారికి అరటి పండ్లు పంచుతున్నది. అరటి పండ్లు పంచిన విధానంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చేతులు తాకకుండా.. దూరం నుంచి పండ్లను విసిరివేస్తున్నట్లుగా ఉండడంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘బ్రిటీషర్ల తర్వాత బాలీవుడ్ సెలబ్రెటీలు, ఉన్నత వర్గాలు మాత్రమే పేదలను తాకడంలో ఇబ్బంది పడుతున్నారు’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు ఏక్తా కపూర్ నుంచి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుండడంతో shame on Ekta kapoor వంటి హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు.
After British only Bollywood celebrities or HIGH-class people feels untouchability to LOW-class people.
Ironically these high-class rich people are billionaires from money of low & middle class #EktaKapoor #BoycottBollywood #Udhampur #Tabu Didi pic.twitter.com/stRpSgbxl4
— Anveshka Das (@AnveshkaD) September 29, 2022