శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కొండవీడు’. దసరాజు గంగాభవాని సమర్పణలో బీపీఆర్ సినిమా పతాకంపై ప్రతాప్ రెడ్డి నిర్మించారు. సిద్ధార్థ శ్రీ దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో నిర్మాత ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ…‘సినిమా సిద్ధంగా ఉన్నా కొవిడ్ వల్ల విడుదల చేయలేకపోయాం. ఫారెస్ట్ లొకేషన్స్లో చిత్రీకరించాం. ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. సినిమాకూ అదే ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ‘అడవి నేపథ్యంలో సాగే చిత్రమిది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్వేతా వర్మ, ప్రతాప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.