బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో తొలి రోజు నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మొదటి రోజు ఒకరినొకరు ఎంతో ప్రేమగా పలకరించగా,ఆ తర్వాత పరిస్థితులే పూర్తిగా మారిపోయాయి. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు చేస్తూ హౌజ్లో నానా రచ్చ చేస్తున్నారు. బుధవారం జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ మధ్య దారుణమైన ఫైటింగ్ జరిగింది.
పంతం నీదా నాదా అనే టాస్క్లో సన్నీ.. పింకీ చేయిని విసిరేయడంతో ఆమె కింద పడింది. ఇది చూసి చలించిన శ్రీరామ్.. సన్నీని తిట్టాడు.ఇదే క్రమంలో మగాడివైతే ఆడుదువురా అంటూ అతడిని ప్రియ మరింత రెచ్చగొట్టింది .పర్పుల్ టీమ్ మీద పడి పిల్లోస్ తీసుకోవాలని చూసిన ఉమాదేవిని ప్రియ ఓ వస్తువుతో కొట్టింది.
దీంతో ఉమా దేవి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నన్నుకొడితే డ్రెస్ చింపుతానని ఉమా అనడంతో అనీ మాస్టర్ ఫైర్ అయింది. ఒసేయ్ ఉమా, సిగ్గు లేదా, థూ అని చీదరించుకుంది. దీనికి ఉమా నువ్వు పెద్ద క్లాసు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది.ఇక శ్వేతను తన్నేందుకు ప్రియ ప్రయత్నించగా, మేం తన్నించుకునేందుకు బిగ్ బాస్కి రాలేదని తన మొర బిగ్ బాస్తో చెప్పుకుంది శ్వేత. అయితే ఇంత రచ్చ అయిపోయాక బిగ్ బాస్ హౌజ్లో హింసకు తావు లేదని మెల్లగా చెప్పాడు బిగ్ బాస్.
టాస్క్ పూర్తయ్యే సమయానికి రెండు టీమ్స్ దగ్గరా 11 బెటాన్స్ ఉండటంతో ఇరు టీమ్స్కు ఐదు జెండాలు పంపించాడు బిగ్బాస్. ఇక రాత్రిపూట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్న శ్రీరామ్ హమీదాకు మసాజ్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య రొమాంటిక్ ముచ్చట్లు జరిగాయి. ఇక లోబో తను ఫ్యామిలీని మిస్ అవుతున్నానంటూ ఏడ్చేశాడు.