కరోనా వలన కొన్నాళ్లుగా థియేటర్స్ మూతపడ్డంతో చాలా సినిమాలు రిలీజ్కి నోచుకోలేదు.ఇక ఇప్పుడిప్పుడే థియేటర్స్ తెరుచుకుంటుండడంతో విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలు రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో మెగా మేనల్లుళ్లు వారం గ్యాప్లో పోటీ పడనున్నారు. ఈ పోటి ఆసక్తిగా మారనున్నట్టు తెలుస్తుంది.
సాయి తేజ్ ప్రస్తుతం దేవ కట్టా దర్శత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు . ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో తేజ్ కనిపించనుండగా, ఆయన సరసన ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది.
ఇక ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తన రెండవ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేయగా, ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి – రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు. అంటే వారం వ్యవధిలో సోదరులిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నారు.