సినీ తారలు తమ ప్రేమ వ్యవహారాల్లో గోప్యత పాటించడం అంత సులభం కాదు. ఎంత దాచే ప్రయత్నం చేసినా ఏదో సందర్భంలో బయటపడుతుంది. బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్కు అదే పరిస్థితి ఎదురైంది. ఇటీవల ఈ భామ ముంబయిలో జరిగిన కియారా అద్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా వివాహ విందుకు హాజరైంది. ఈ వేడుకలో భూమి పెడ్నేకర్ ఓ యువకుడితో రహస్యంగా సంభాషించడం..అనంతరం అతని నుదిటిని సుతారంగా ముద్దాడే దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. భూమి పెడ్నేకర్తో అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎవరో అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. చివరకు ఆ వీడియోలో ఉన్నది ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త యష్ కటారియా అని తేల్చారు.
ఈ యువ వ్యాపారవేత్తతో భూమి పెడ్నేకర్ గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయితే వీటిపై ఆమె ఎక్కడా పెదవి విప్పలేదు. తాజా వీడియోతో ఈ భామ ప్రేమాయణం గురించి అభిమానులు ఆసక్తికరంగా చర్చించుంటున్నారు. బాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాల్లో సత్తా చాటుతూ ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకుంది భూమి పెడ్నేకర్.