బాలీవుడ్ నాయిక భూమి ఫెడ్నేకర్ నటించిన కొత్త సినిమా ‘గోవింద్ నామ్ మేరా’. వికీ కౌశల్ హీరోగా కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో…దర్శకుడు శశాంక్ కైతాన్ తెరకెక్కించారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ నెల 16న ఓటీటీలో నేరుగా విడుదల కానుందీ సినిమా.
ఈ సందర్భంగా భూమి ఫెడ్నేకర్ మాట్లాడుతూ…‘ఇందులో నేను చేసిన గౌరీ అనే క్యారెక్టర్ పురుషుల కంటే నేనేం తక్కువ అనేలా ఉంటుంది. తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుంది. సహజంగా సినిమాల్లో నాయికలకు డైలాగ్స్ ఎక్కువగా చెప్పే అవకాశం ఇవ్వరు. పంచ్ డైలాగ్స్ అన్నీ హీరోలకే ఇస్తుంటారు. ఆ అవకాశం వారికేనా అనిపించేది. కానీ ఈ సినిమాలో నేనే పంచులు వేస్తా. ఆ మాటలకు ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని నమ్ముతున్నా’ అని చెప్పింది.