ఇటీవల ‘దృశ్యం 2’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. ఇదే ఉత్సాహంలో ఆయన తన కొత్త చిత్రాలతో వరుసగా తెరపైకి రాబోతున్నారు. అజయ్ దేవగణ్ నటిస్తున్న ‘భోలా’ మార్చి 30న తెరపైకి రాబోతున్నది. ఇక ఆయన కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రంగా భావిస్తున్న ‘మైదాన్’ కూడా విడుదలకు సిద్ధంగానే ఉంది. దిగ్గజ భారత ఫుట్బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు అమిత్ శర్మ రూపొందిస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఆటగాడిగా, కోచ్గా భారత ఫుట్బాల్ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించారు. ఈయన పాత్రలో అజయ్ దేవగణ్ నటించారు. మే 12న విడుదల కావాల్సిన ఈ సినిమా మరో నెల ఆలస్యంగా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.