అంజిబాబు, ప్రసన్న, కీర్తి లత, అభి, కావేరీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ఏబీ సినిమాస్, నీహాల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బత్తిని కీర్తిలత గౌడ్ నిర్మాత. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.
నియోరియలిజం జానర్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదని చిత్రబృందం చెబుతున్నది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ…‘భీమదేవరపల్లిలోని సామాన్యుడి జీవన చిత్రాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం.
సినిమా చూస్తున్నంతసేపు పల్లె వాతావరణం కళ్లకు కట్టినట్లు ఉంటుంది. కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీతో పాటు పాటల చిత్రీకరణ జరిపాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు.