మంచిర్యాల: జానపద పాటలతో దూసుకెళుతున్న కుమ్మరి దుర్గవ్వను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సన్మానించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యల పల్లి గ్రామానికి చెందిన ఆమెను.. పార్టీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సినీ పరిశ్రమలో అగ్ర హీరో పవన్ కల్యాణ్ నూతన సినిమా భీమ్లానాయక్ సినిమాలో పాట పాడే అవకాశం రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సినిమాల్లో ఆమె మరిన్ని పాటలు పాడుతూ అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
మంచిర్యాల జిల్లాలో నిరక్షరాస్యత అధికంగా ఉందని, ఇప్పుడిప్పుడే ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళుతున్నారన్నారు. మారుమూల ప్రాంతాల్లోని కళాకారులను వెలికితీసుకురావడంలో సోషల్ మీడియా ఎంతో ముందు స్థానంలో ఉందన్నారు.