సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోషి నటిస్తున్న చిత్రం ‘భారీ తారాగణం’. శేఖర్ ముత్యాల దర్శకుడు. బీవీ రెడ్డి నిర్మాత. ఈ నెల 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘లవ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన చిత్రమిది. యువతరంతో పాటు అన్ని వర్గాల వారు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సరయు ప్రత్యేకగీతం కుర్రకారును అలరిస్తుంది’ అన్నారు.