Raviteja | రవితేజ కథానాయకుడిగా హరీశ్శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే ఖరారైంది. ఈ సందర్భంగా శనివారం విడుదల చేసిన పోస్టర్లో ఈ భామ సంప్రదాయ పరికిణీ ఓణీలో అందంగా కనిపిస్తున్నది.
‘హరీశ్శంకర్ సినిమాల్లో కథానాయికల పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో కూడా నాయకానాయికల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. రవితేజ-హరీష్శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: హరీశ్శంకర్.
Dear #Bhagyashri hearty welcome ..you are here to stay and Conquer…. Because you are born to WIN.. wishing you a BlockBuster Career which starts with our film….
Lots of love and Best wishes
😍😍🤗🤗 pic.twitter.com/DbmY8Tta7x— Harish Shankar .S (@harish2you) December 16, 2023