Jana Nayagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం జన నాయగన్ (Jana Nayagan). కార్తీ (ఖాకీ) ఫేం హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయ్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్తో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో డైరెక్టర్ హెచ్ వినోథ్ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
జన నాయగన్ పోస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ను విజయ్ డైరెక్ట్ చేశాడట. ఈ సీన్లో డైరెక్టర్లు లోకేశ్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ పాత్రను వరుస ప్రశ్నలు అడుగుతారు. సినిమాకు హైలెట్గా నిలిచే సీన్లలో ఒకటిగా ఇది ఉంటుందన్నాడు హెచ్ వినోథ్. విజయ్తోపాటు సిల్వర్ స్క్రీన్పై ఒకేసారి విజయ్తోపాటు ముగ్గురు డైరెక్టర్లను చూడొచ్చన్నతాజా అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు మూవీ లవర్స్, అభిమానులు.
జన నాయగన్ చిత్రంలో పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జన నాయగన్ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇప్పటికే వరల్డ్వైడ్గా గ్రాండ్గా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది. ఆ తర్వాత సెన్సార్ చిక్కులను అధిగమించి ఫైనల్గా థియేటర్లకు రాబోతుండటంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతూ సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది.
Watch: జిప్లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్
Health News | రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితమే.. తాజా అధ్యయనంలో వెల్లడి..!