తన పాఠశాల రోజుల గురించి కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ఇంగ్లిష్ రాకపోవడంతో అందరూ తనను ఆటపట్టించేవారని, నాటి అవమానాలను సవాలుగా తీసుకొని చదువుల్లో రాణించానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ కాలేజీ విద్యార్థులతో జరిపిన ముఖాముఖిలో ఆమె ఈ సంగతుల్ని వెల్లడించింది. ‘మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో నా బాల్యం గడిచింది. అక్కడే మరాఠీ మీడియం స్కూల్లో చదువుకున్నా. కొన్నాళ్ల తర్వాత నాన్న ఉద్యోగరీత్యా మా కుటుంబమంతా నైజీరియాకు షిప్ట్ అయ్యాం. అక్కడ ఇంగ్లిష్ మీడియం కావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.
నాకేమో మరాఠీ, హిందీ తప్ప మరో భాష తెలియదు. ఇంగ్లిష్ రాదని స్కూల్లో అందరూ హేళన చేసేవారు. జోక్స్ వేస్తూ ఆటపట్టించేవారు. అయినా నేను ఏ మాత్రం కుంగిపోలేదు. అవహేళనలను ఛాలెంజ్గా స్వీకరించా. కొద్దిరోజుల్లోనే ఇంగ్లిష్పై పట్టుసాధించాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంగ్లీష్లో అనర్గళంగా ప్రసంగించే స్థాయికి చేరుకున్నా. పాజిటివ్ మైండ్సెట్తో ఉంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవొచ్చని నా స్కూల్ డేస్లోనే అర్థమైంది’ అని చెప్పింది భాగ్యశ్రీ బోర్సే. ఇటీవలే ఈ భామ ‘లెనిన్’ సినిమాతో కెరీర్లో తొలి విజయాన్ని అందుకుంది.