బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సార్’ సినిమా ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నది నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని. ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. జూన్ 2న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా అవంతిక దస్సాని మాట్లాడుతూ…“ ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో ‘ఛత్రపతి’ మూవీ చేశారు. అందులో అమ్మ భాగ్యశ్రీ మదర్ క్యారెక్టర్లో నటించింది.
అలా పరిచయంలో నా గురించి నిర్మాత సురేష్ తెలుసుకున్నారు. ఆయన ద్వారా ఈ కథ విన్నాను. ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నా పాత్ర పేరు శ్రుతి. కాలేజ్ స్టూడెంట్గా కనిపిస్తా. శృతి, ఫోన్ కలిసి సుబ్బు జీవితాన్ని ఎలా మార్చేశాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కామెడీ, రొమాన్స్, థ్రిల్, యాక్షన్ వంటి అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. పరిశ్రమలో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. నేను కూడా కథలో కీలకంగా ఉండే పాత్రల్లో నటించేందుకు ఇష్టపడతాను’ అని చెప్పింది.