తిరుమల : ప్రముఖ తెలుగు సినిమా నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సోమవారం తిరుమలలోని శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా తెల్లవారుజామున వీఐపీ దర్శన వేళల్లో స్వామివారిని దర్శించుకున్నట్లు సాయి శ్రీనివాస్ వెల్లడించారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై అడిగిన ప్రశ్నకు సమాదానం ఇవ్వడానికి నిరాకరించారు.