హైదరాబాద్ : భారత్, థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ఏడు దేశాల నుండి 2,36,966 బైక్లను రాయల్ ఎన్ఫీల్డ్ రీకాల్ చేసింది. మేటోర్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350 బైక్ల రీకాల్కు ఆదేశాలు జారీ చేసింది. ఇగ్నిషియన్ కాయిల్తో పొటెన్షియల్ డిఫెక్ట్ ఉందని దీని వల్ల వాహనాల పనితీరు తగ్గడంతో పాటు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్కి దారితీస్తుందని కంపెనీ తెలిపింది. సాధారణ అంతర్గత పరీక్షల సమయంలో లోపం కనుగొనబడిందని, డిసెంబర్ 2020 నుండి ఏప్రిల్ 2021 మధ్యకాలంలో దాని బాహ్య సరఫరాదారు నుండి ఈ సమస్య స్పష్టంగా గుర్తించబడిందని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బైక్ల రీకాల్ అని వెల్లడించింది.