సంధ్యా, వర్షిని, అఖిల్, దేవర్షి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బంగారు తల్లి’ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీ విజయరాము పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ దర్శకత్వంలో బొద్దం రాము యాదవ్, విజయ్ రూపొందిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు బాబుమోహన్ కెమెరా స్విఛాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ సినిమాతో తాను పవర్ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపిస్తానని సంధ్యావర్షిణి పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ను త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: లక్ష్మణ్, దర్శకత్వం: ప్రదీప్ వీఆర్ఏ.