నందమూరి హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్బీకే 107 (Nbk 107)గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమాపై కొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం సగభాగం షూటింగ్ పూర్తయింది. ఇక నెక్ట్స్ షెడ్యూల్ కోసం బాలకృష్ణ టీం టర్కీకి పయనం కానుందని టాక్. ఆగస్టు 25న గోపీచంద్ మలినేని, బాలకృష్ణ టీం టర్కీకి బయలుదేరనుందట. ఈ షెడ్యూల్లో కీలక యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
అఖండ తర్వాత థమన్ మరోసారి ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియోలో గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ తో అదరగొట్టేస్తున్నాడు బాలయ్య. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుందని వీడియో చూస్తే అర్థమవుతుంది.
కన్నడ యాక్టర్ ధునియా విజయ్ ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న ఈ ప్రాజెక్టులో వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.