అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటిస్తున్న డివోషనల్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2 – తాండవం’. బ్లాక్బస్టర్ ‘అఖండ’కు ఈ సినిమా సీక్వెల్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని రీసెంట్గా పవన్కల్యాణ్ ‘ఓజీ’ ప్రీమియర్ షోలో మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ను ‘ఓజీ’ ప్రింట్స్కు జతచేసి ప్రదర్శించడం విశేషం.
నిజానికి ‘అఖండ 2’ ఈ నెల 25న ‘ఓజీ’తోపాటు విడుదల కావాల్సింది. కానీ నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమాను వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఎట్టకేలకు డిసెంబర్ 5న ‘అఖండ 2 – తాండవం’ రాబోతున్నది. సంయుక్తామీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్గా కనిపించనున్నారు. బాలీవుడ్ బాలనటి హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రధారి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, సమర్పణ: ఎం.తేజస్విని నందమూరి.