నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకుడు. గురువారం ఈ చిత్ర టీజర్ను బలగం వేణు విడుదల చేశారు. కీర్తి మాట్లాడుతూ ‘మన పురాణాల ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నా. పురాణాల్లోని జయవిజయులు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసులుగా పుట్టారు.
వాళ్లు కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్తో ఈ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు. ‘ఈ సినిమా ద్వారా ఓ విభిన్నమైన ప్రయత్నం చేశాం. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి ఓ కొత్త తరహా చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందిస్తుంది’ అని నిర్మాత దాము రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రుషి కోనాపురం, సంగీతం: రాజీవ్ రాజ్.