నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సక్సెస్ మూడ్లో ఉన్నారు. 61 సంవత్సరాల వయస్సులో ఎంతో ఎనర్జిటిక్గా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ రీసెంట్గా అఖండ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద విజయం సాధించింది. సినీ ప్రేక్షకులే కాదు పలువురు ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే గత రాత్రి బాలకృష్ణ తన టీంతో కలిసి అఖండ చిత్రాన్ని ఏఎంబీ మాల్లో వీక్షించారు.
మూవీ పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన సినిమాని ఇంత హిట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నపిల్లలకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. వారు నా దగ్గరకు వచ్చి ‘అంకుల్.. సినిమా అద్భుతంగా ఉంది’ అని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ వారు నన్ను అంకుల్ అనడం నాకు నచ్చలేదు అంటూ బాలకృష్ణ సరదాగా కామెంట్ చేశారు. కాగా, బాలకృష్ణతోపాటు చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత తదితరులు కూడా సినిమాని వీక్షించారు.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను- నటసింహం బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా ఈ అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ద్వారకా క్రియేషన్స్పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించారు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించగా.. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించారు. తమన్ బాణీలు కట్టారు.