ManiRatnam | దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్తో తీసిన గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో, మణిరత్నం మళ్లీ తన మార్క్ రొమాంటిక్ జోనర్లోకి అడుగుపెట్టారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కోల్కతా నగరంలోని విభిన్న రంగులు, అక్కడి వీధులు, స్థానిక రైళ్లు మరియు సాంస్కృతిక వాతావరణాన్ని ఈ టీజర్ అందంగా ఆవిష్కరించింది.
మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకరైన ‘యువ’ సినిమాను ఈ కోల్కతా బ్యాక్డ్రాప్ మరోసారి గుర్తుచేస్తోంది. మణిరత్నం విజువల్ స్టైల్కు తగినట్లుగా ఏ.ఆర్. రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి ఏవీక్ ముఖోపాధ్యాయ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఏకా లఖాని కాస్ట్యూమ్ డిజైనర్గా, శర్మిష్ఠ రాయ్ ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను సెప్టెంబర్ 7న అధికారికంగా ప్రకటించబోతుంది.