శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా దర్శకుడు శ్రీనివాస్ జొన్నలగడ్డ రూపొందిస్తున్న సినిమా ‘ఆటో రజినీ’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఇటీవల ఏపీ సీఎం జగన్ను చిత్ర బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ జొన్నలగడ్డ మాట్లాడుతూ..‘సీఎం జగన్ను కలవడం సంతోషంగా ఉంది. ఆయన విషెస్ తీసుకున్నాం. ఇప్పటివరకు 50శాతం టాకీ పూర్తయింది. ఇటీవల మా సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ మాస్టర్ కనల్ కణ్ణన్ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్లు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరణ జరిపాం. తదుపరి షెడ్యూల్ జూన్ 10 నుంచి ఉంటుంది. నెల్లూరు కృష్ణపట్నం పోర్టులో జూలై 10 నుంచి ైక్లెమాక్స్ చిత్రీకరణ చేయాలని అనుకుంటున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ప్రసాద్ బాబు, సంగీతం : మణిశర్మ.