Attack Movie On OTT | బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎటాక్ పార్ట్-1’. లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దానికి తోడు అప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ హిందీలో దూసుకుపోతుండంతో ఈ సినిమా కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలీన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జీ సంస్థ తాజాగా వెల్లడించింది.
ఈ సినిమా సీక్వెల్కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. పార్ట్-1 ఫలితంలో మేకర్స్ డైలమాలో పడ్డారు. పార్ట్-2 ను విడుదల చేసే ఆలోచనను విరమించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం సగం బడ్జెట్ను కూడా రికవరీ చేయలేకపోయింది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం ఆర్మీ అధికారిగా నటించాడు.